గాడాల గ్రామంలో నాలుగో రోజు జనం కోసం జనసేన మహా పాదయాత్ర..

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో 4వ రోజు జనం కోసం జనసేన మహా పాదయాత్ర జన శ్రేణులు జన సైనికులతో ముందుకు సాగింది.. ఈ పాదయాత్రలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులకు అడుగడుగున హారతులు పడుతూ ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు.. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ఎండల తీవ్రత అధికంగా ఉండడం, వడగాల్పుల వలన ఇబ్బందులకు గురి అవుతున్న ఉపాధి హామీ కూలీలకు రేపటినుండి వర్షాలు పడే వరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయబోతున్నామని తెలియజేసారు.. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుందని తెలియజేశారు..ఈ సందర్భంగా అక్కడ ఉన్న పలు ఉపాధి హామీ కూలీలు ఇంతటి మంచి నిర్ణయం తీసుకున్న బత్తుల దంపతులకు ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అడ్డాల శివ సూర్య చక్రవర్తి, రాధంశెట్టి వెంకన్న, మాధవరపు శ్రీనివాస్, అడ్డాల శ్రీనివాసు, మడికి వీర్రాజు, మట్ట నాగు, మట్ట గణేష్, కోమలి విష్ణు, ఆంజనేయులు, మల్ల సత్యానంద, సిద్ధి వీర్రాజు, నడిపి వెంకయ్య, మళ్లీ మొగ్గల సూర్యనారాయణ, సీనియర్ నాయకులు కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.