బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో ‘జనంలోకి జనసేన’ పాదయాత్ర

నరసాపురం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ స్ఫూర్తితో జనవరి 26వ తేదీ గురువారం ఉదయం 9-45 నిమిషాలకు గొంది గ్రామం నుండి నరసాపురం నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీని మరింత చేరువ చేసేలా, పార్టీ సిద్ధాంతాలతో ప్రజల్ని చైతన్యవంతులని చేసేలా, నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న సమస్యలు, వారి ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాన్ని చూపేలా నియోజకవర్గ, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలతో “జనంలోకి జనసేన” అనే నినాదంతో పాదయాత్ర చేయనున్నట్టు నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఒక ప్రకటనలో తెలియజేసారు.