అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో భోజనాలు ఏర్పాటుచేయనున్న జనసేన

అమలాపురం ఆసుపత్రిలో పేషంట్స్ కి భోజనం నిలిపివేత
సూపరింటెండెంట్ ని కలిసిన మండల జనసేనపార్టీ అద్యక్షులు శ్రీ లింగోలు పండు

తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషంట్స్ కి పెడుతున్న భోజనాల బిల్లులను గత 19 నెలలుగా జగన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించక పోవడంతో, ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యం, కాంట్రాక్టర్లు భోజనాలను నిలిపివేయటం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ లింగోలు పండు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస, అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి శుక్రవారం నుండి జనసేన పార్టీ తరపున పేషంట్స్ కి భోజన ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నల్లా వెంకటేశ్వరరావు, నిమ్మకాయల రాజేష్, దూలం శ్రీను, సతీష్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.