గ్రేటర్ పరిధిలో శంకర్ గౌడ్ అధ్యక్షతన జనసేన సమావేశం

*జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మరియు సంబందించి గ్రేటర్ పరిధిలోని జనసేన సమావేశం

మార్చి 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మరియు క్రియాశీలక సభ్యత్వం కొరకై తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ ఎన్. శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు అర్. రాజలింగంతో.. కేవలం గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, సనత్ నగర్, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, పటాన్ చెరువు నియోజక వర్గాలకు సంబంధించిన నాయకులు, గ్రేటర్ కమిటీ సభ్యులు, వీర మహిళలు, మరియు జనసైనికుల తో జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు అర్హం ఖాన్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కావ్య మరియు గ్రేటర్ జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి , గ్రేటర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.