జనసైనికుడిపై దాడిని ఖండించిన సారే ఓబులేసు నాయుడు

గిద్దలూరు నియోజకవర్గం, కొమరోలు మండలం చింతలపల్లి పంచాయతీ మల్లిక పల్లిలోని ఉపాధి హామీ పథకం కింద పశువుల నీటితొట్టిని వైసిపి కార్యకర్తలు ధ్వంసం చేస్తుండగా మన జనసైనికుడు అడ్డుకోగా అతనిపై దాడికి దిగారు ప్రజలందరి కోసం కట్టించిన నీటితొట్టి కావడంతో జనసైనికుడు ఎక్కలూరి వెంకటేశ్వర్ రెడ్డి ప్రశ్నించాడు అంతలో ధ్వంసం చేసే వ్యక్తి అయినటువంటి కొత్తకోట రమణయ్య అతని కొంతమంది బంధువులతో దాడికి దిగి జనసైనికుడిని గాయపరచడం జరిగింది. ఈ సంఘటనపై జనసేన పార్టీ కొమరోలు మండల అధ్యక్షుడు అయినటువంటి సారే ఓబులేసు నాయుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, అతనిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని, కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ ని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.