నెల్లూరు జిల్లా ముఖ్య నాయకులతో జనసేనాని భేటీ

నెల్లూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్, సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మరియు రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వరులు గార్లతో భేటీ అయ్యరు. దాదాపు 45 నిముషాలు పాటు సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు. నెల్లూరు జిల్లాలో వాస్తవ పరిస్థితులను జనసేనానికి వివరించటం జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రోత్సాహం మరియు భరోసాతో జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం మరింతా ఉత్సాహంతో కొనసాగుతాయి. పార్టీ కోసం నిస్వార్థంగా పని చేస్తున్న కమిటీ సభ్యులు, డివిజన్ ఇంచార్జులు మరియు మండల నాయకులతో కూడా త్వరలో భేటీ జరుగనున్నది.