జనసేన లీగల్ సెల్ సమావేశాన్ని విజయవంతం చేయండి: డోల రాజేంద్రప్రసాద్

విజయనగరం: జనసేన పార్టీ లీగల్ సెల్ సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు డోల రాజేంద్రప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన పత్రికాప్రకటనలో తెలిపారు.

విజయనగరం లీగల్ సెల్ విభాగం నుండి శనివారం ఉదయం ఆర్.టి.సి. కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జి.ఎస్.ఆర్. ఇంటర్నేషనల్ హోటల్లో ఉదయం పది గంటలకు ప్రారంభం కానుందని, ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా హైకోర్టు న్యాయవాది, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ రామచంద్ర, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు మరియు ప్రముఖ జిల్లా న్యాయవాదులు, జిల్లా జనసేన నాయకులు హాజరువుతున్నారని తెలిపారు. కావున ఈ సమావేశానికి జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, మెగాఫ్యామిలీ అభిమానులు విచ్చేసి విజయవంతం చేయాలని జనసేన లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు డోల రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.