యాక్సిడెంట్ లో గాయాలు పాలైన జనసైనికులకు అండగా జనసేన

కురుపాంలో జనసైనికులు ఇద్దరు యాక్సిడెంట్ లో గాయాలు పాలైనారు.. ఆ విషయం తెలిసిన వెంటనే జనసేన పార్టీ తరుపున, మన రాష్ట్ర ప్రచారకార్యదర్శి బాబు పాలూరు, జనసైనికులు అందరూ.. యాక్సిడెంట్ లో గాయాలు పాలైన జనసైనికులను పరామర్శించి.. వారి కుటుంబాలకు అండగా ఉంటాం అని భరోసా ఇవ్వటం జరిగింది. యాక్సిడెంట్ లో గాయాలు పాలైన జనసైనికులను పరామర్శ చేయటానికి కురుపాం జనసేన నాయకులు, జనసైనికులు, పార్వతీపురం సీతానగరం మండలాల నుంచి జనసైనికులు కూడా వచ్చి.. జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది అని వారి కుటుంబాలకు హామీ ఇవ్వటం జరిగింది.