సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించిన పిడుగురాళ్ల జనసేన

గురజాల, సావిత్రిబాయి పూలేకు వర్ధంతిని పురస్కరించుకొని పిడుగురాళ్ల మండల పార్టీ ఆఫీసు నందు పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు మీద అలుపెరగని పోరాటం చేసి, మహిళా హక్కుల కోసం విశేష కృషి చేసిన వీర వనిత అని, మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ నిత్యం ఆయన మార్గంలో తోడుగా వున్నారని, మొట్టమొదటి భారతదేశ మహిళ ఉపాధ్యాయురాలుగా, మహిళా అక్షరాస్యులుగా, రచయిత్రిగా ఆమె సేవలు మరువలేనివని కొనియాడారు. జిల్లా సంయుక్త కార్యదర్శి కాసిం సైదా మాట్లాడుతూ కుల వ్యవస్థకు, అంటరానితనానికి వ్యతిరేకంగా నూతన వ్యవస్థ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు దూదేకుల సలీం, పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షుడు పెడకొలిమి కిరణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, ఆవుల వెంకట రమేష్, కార్యదర్శులు
కండేపుడి వంశీ, జానపాడు ప్రధాన కార్యదర్శి అంబటి సాయి, బేతంచర్ల ప్రసాద్, సూరం నాగమల్లి, ముక్కంటి, నూతి శేషు, కొప్పుల నరసింహారావు, పరమేశ్వరరావు, గౌరి, ధర్మ తదితరులు పాల్గొన్నారు.