ఇమ్మడి కాశీనాథ్ మద్దతు కోరిన ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం

మార్కాపురం, ఈనెల 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్ రెడ్డి మరియు ఉపాధ్యాయ నియోజకవర్గం పిడిఎఫ్ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబు రెడ్డి కి మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతూ శుక్రవారం ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మార్కాపురం వెళ్ళి జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఇమ్మడి కాశీనాథ్ తో భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈపాటికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలకు మద్దతు ప్రకటించారని మార్కాపురం నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ తరఫున కార్యకర్తలతో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో తిరుగుతానని పిడిఎఫ్ అభ్యర్థులు గెలుపు కోసం జనసేన పార్టీ సభ్యులు పవన్ కళ్యాణ్ అభిమానులు పిడిఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డీకేఎం రఫీ, దగ్గుపాటి సోమయ్య, జి బాలనాగయ్య, కెవిపిఎస్ నాయకులు జవాజి రాజు, డివైఎఫ్ఐ నాయకులు జక్కి వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఐ నాయకులు కార్తీక్, చరణ్, బాబ్జి, జనసేన పార్టీ తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు మరియు మార్కాపురం జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు పాల్గొన్నారు.