లారీ కార్మికుని కుటుంబానికి అండగా జనసేన

గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలోని ఒక ఎస్సి నిరుపేద కుటుంబానికి చెందిన లారీ డ్రైవర్ అనారోగ్య కారణంతో చనిపోతే వారి కుటుంబానికి 5000/- ఆర్ధిక సహాయం చేసిన జనసేన పార్టీ నాయకులు డేగల లక్ష్మణ్, ముళ్ళపూడి చిన్న వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ… సహాయం చేయటంలో జనసేన పార్టీ ముందుంటుందని తెలిపారు.