జెట్టిపల్లి గ్రామంలో జనసేన పల్లెబాట

పూతలపట్టు: తవణంపల్లి మండలంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు రాజశేఖర్ జెట్టిపల్లి గ్రామంలో జనసేన పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి నూతన సంవత్సర క్యాలెండర్లను పంపిణీ చేసి, జనసేన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. దాదాపు 50 కుటుంబాలను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నికిల్ కళ్యాణ్, అమర్ బాబు, లాలూ ప్రసాద్, సునీల్‌ కుమార్, అనీల్, అచ్యుత్ మరియు అభీ పాల్గొనడం జరిగింది.