ఇంగ్లాపల్లి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం ఇంగ్లాపల్లి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం జనసేన కార్యకర్త లెంక సూర్యనారాయణ బైక్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. వారికి పదివేల రూపాయలు గెద్ద రవి ఆర్థిక సహాయం అందించారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఇద్దరు ఆడ పిల్లలకు తగు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. పెదమానాపురం రైల్వే గేట్ నుంచి ఇంగ్లాపల్లి గ్రామం వరకు 350 బైకులతో ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా శ్యామలపల్లి రెవిన్యూ పరిధిలో కొండను తొలిగించాలని అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. కొండలు తొలగించకుండా ఆపాలని గ్రామస్తులు జనసేన పార్టీకి వినతిపత్రం అందజేశారు. విజయనగరం ఇంచార్జ్ పాలవలస యశస్విని మరియు నియోజకవర్గ ఇంచార్జ్ లు గెద్ద రవి, మరపు సురేష్, పాలూరు బాలు, దుర్గాప్రసాద్, అప్పారావు జనసేన నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.