జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం

రాజమండ్రి రూరల్: ఎండాకాలం ఎండ తాకిడి ఎక్కువగా ఉన్న వేళ.. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఎప్పుడూ ముందుండే జనసేన పార్టీ ఆదివారం ఉదయం ఏవి రోడ్డు ఎన్.హెచ్ 5 సిగ్నల్ పాయింట్ వద్ద చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన 9వ వార్డు జనసేన నాయకులు చౌకొండా మురళి కృష్ణ, 9వ వార్డు జనసేన నాయకులు బత్తిన సత్యనారాయణ, పడాల వీర్రాజు, టి వీర్రాజు, కాకర కుమార్, కే రామకృష్ణ, ఎం గణేష్ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.