బోన్ టీబీ తో బాధ పడుతున్నమహిళకు సాయం అందించిన జనసేన

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా.. రాజమండ్రి మల్లయ్య పేటకి చెందిన బోన్ టీబీ (Bone Tb)వ్యాధితో భాదపడుతూ.. మంచానికే పరిమితమైన 30 సంవత్సరాల వయసు కల “ఎం.ఏ ఏకనామిక్స్” చదివిన మహిళకు రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5000/ఆర్ధిక సాయం చేయటం జరిగింది. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ మహిళ కి ఆపరేషన్ నిమిత్తం 150000/ఖర్చు అవుతుంది అని ఒక ప్రముఖ ఆసుపత్రి వారు చెప్పడం జరిగింది, పెద్ద దిక్కు లేని ఈ కుటుంబానికి దాతలు సహాయం చేసి ఈ మహిళ కి జీవితంపై ఆశ కల్గిస్తారని ఆశిస్తూన్నాను అంటూ శ్రీనివాస్ ఫోన్ నెంబర్ ను తెలియజేయడం జరిగింది. ఫోన్: 9848866877.