దర్శిలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

దర్శి: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు సూచనల మేరకు దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో గల జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలోను మరియు అద్దంకి రోడ్డులో జనసేన పార్టీ నాయకులు శ్రీ గరికపాటి వెంకట్ ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలోను పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా కురిచేడు రోడ్డులో గల కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య జనసేన పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేశారు. ఆంతరం గరికపాటి వెంకట్ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ నాయకులు దిరిశాల ఏసురెడ్డి, గరికపాటి వెంకట్ సోదరులు గరికపాటి పవన్ పార్టీ జండాను ఎగురవేసి కేకును కట్ చేశారు. ఆహుతులకు మిఠాయిలు పంచారు. గరికపాటివెంకట్ మధ్యాహ్న విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకలలో పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు శ్రీ పసుపులేటి చిరంజీవి, నియోజకవర్గ ఐ టి కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు గుండాల నాగేంద్ర ప్రసాద్, దొనకొండ పట్టణ కమిటీ అధ్యక్షులు షఫీయుల్లాఖాన్, నియోజకవర్గ నాయకులు పుప్పాల పాపారావు, ఉల్లి వెంకటేశ్వర్లు, పార్టీ వివిధ కమిటీల సభ్యులు యాదాల వెంకటేష్, పులి కిషోర్, జగన్నాథం వెంకటేశ్వర్లు, ఇతర జనసైనికులు పాల్గొన్నారు. వీరితోబాటు ముండ్లమూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గోపు కోటయ్య కూడా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియచేశారు.