జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 30 మంది గర్భిణీ స్త్రీలను సత్కరించి సీమంతం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.