జనసేనాని స్ఫూర్తితో డొక్కా సీతమ్మ చలివేంద్రం

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్దాంతాలను ప్రజలకి వివరిస్తూ, లావేరు పంచాయితీలో జనసేన పార్టీ నాయకులు దొర రాజా రమేష్ (ఎంపీటీసీ అభ్యర్థి) ఆధ్వర్యంలో లావేరు పంచాయితీ జనసైనికుల సహకారంతో హైస్కూల్ ఎదురుగా వస్త్రపురి కొలనిలో ఆదివారం ఎండ తీవ్రతకి చాలా ఇబ్బంది పడుతున్న రహదారిన పోయే ప్రయాణికుల దాహం తీర్చేందుకు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చల్లని మజ్జిగతో ప్రారంభించడం జర్గింది. ప్రతిరోజూ మినరల్ వాటర్ అందుబాటులో ఉంచటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కోల రాజేష్, కొమ్మూరు శ్రీను, రేగాన ప్రేమాకుమార్ (పండు) మరియు జనసైనికులు బీర నందు పాల్గొన్నారు.