కోమానపల్లిలో ఇంటింటికి జనసేన – పవన్ రావాలి పాలన మారాలి

ముమ్మిడివరం నియోజకవర్గం: ఇంటింటికి జనసేన పవన్ రావాలి పాలన మారాలి కార్యక్రమంలో రెండవ రోజు భాగంగా ముమ్మిడివరం మండలం, కోమానపల్లి గ్రామంలో పితాని బాలకృష్ణ పర్యటించారు. ముందుగా కోమానపల్లి సెంటర్ లో గల భారతరత్న బి. ఆర్ అంబేద్కర్ గారికి, గౌతమ బుద్ధుల వారికి పూలమాల అలంకరించారు. కోమానపల్లి గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి వారిని, పట్టాభి రామచంద్రుల వారిని దర్శించి వారి ఆశీస్సులు తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోమానపల్లి గ్రామంలో జనసేన పార్టీ జండా ఆవిష్కరణ చేసారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కొమానపల్లి గ్రామంలోని వి వి అగ్రహారం మొల్లివారిపేట, జాంబవన్ పేట, యాదవ్ నగర్ బ్రహ్మానవీధి, రెడ్డివారిపాలెంలలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి గాజు గ్లాస్ పై ఓటు వేసి బాలకృష్ణ గారిని గెలిపించాలని కోరారు. గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని కచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో అని సమస్యలు తీరుస్తానని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.