చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ మండల కమిటీ నిర్మాణ ప్రక్రియ

*చంద్రగిరి నియోజకవర్గంలో మండల కమిటీ నిర్మాణ ప్రక్రియ తిరుపతి రూరల్ మండలంలో ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్.

చిత్తూరు, చంద్రగిరి నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు, నియోజకవర్గ నాయకులు దేవర మనోహర, మండల అధ్యక్షులు రాయల్ వెంకట్ ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మండలంలో మండల కమిటీ ఎంపిక ప్రక్రియ సమావేశం నిర్వహించి మండల కమిటీ సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ ని 2024 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడటమే ధ్యేయంగా, పార్టీ మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్న జిల్లా కార్యవర్గం. ఇందులో భాగంగా గురువారం తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు పంచాయితీలో మండల కమిటీ ప్రక్రియ నిర్వహించారు అలాగే ఏ విధమైన సమస్యపై ప్రజల తరపున పోరాడటానికి జనసేనపార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, చిత్తూరు జిల్లా లీగల్ విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీమతి కంచి శ్యామల, జిల్లా కమిటీ జనరల్ సెక్రెటరీ చిన్నా రాయల్, సంయుక్త కార్యదర్శి కీర్తన మరియు దండు లక్ష్మీపతి, రాంబాబు, ఆషా, ప్రతాప్ రెడ్డి, నరేష్, మురళి, పవన్, సాయి, మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.