హామీలు నెరవేర్చే ఏకైక పార్టీ జనసేన

*కిన్నెర కళాకారుడికి సహాయం
*జనసేన నేత లక్ష్మణ్ గౌడ్

సమాజంలో ఆదర్శ రాజకీయాలను చేసేందుకు ఏర్పాటుచేసిన జనసేన పార్టీ మాత్రమే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని జనసేన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. కిన్నెర కళాకారుడు మొగులయ్యను జాతికి పరిచయం చేసిన తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సొంతింటి కలను నెరవేర్చేందుకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, ఆయన ఆదేశాలతో పార్టీ రాష్ట్ర అధికారి శంకర్ గౌడ్ సూచనల మేరకు ఆయన నివాస గృహానికి వెళ్లి కష్టనష్టాలను తెలుసుకున్న తాను స్వతహాగా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా గురువారం నాడు 100 సంచుల సిమెంటు మరియు 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజులలో పేద కళాకారుల ఆదుకునేందుకు తన వంతు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం అని అన్నారు. అధికార పార్టీ నేతలు పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య ను విస్మరించారని.. ప్రభుత్వం మాత్రం కొంత సాయం ప్రకటించడం జరిగిందని వాటిని త్వరగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, రేచర్ల శేఖర్, బైరపోగు సాంబ శివుడు, నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు జానీ, శ్రీరామ్, బారిగారి రాజేందర్, సూర్య, జెర్రిపాటి చంద్ర శేఖర్, కోడిగంటి సాయి, కురుమన్న మరియు పాలమూరు నియోజకవర్గ నాయకులు పగడాల రాఘవేంద్ర మరియు జనసైనికులు పాల్గొన్నారు.