దేవనకొండ మండలంలో రైతులను కలిసిన జనసేన పార్టీ

కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ వెంకప్ప ఆధ్వర్యంలో దేవనకొండ మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట, ఉల్లి పంట, మిరప పంట లను పరీక్షించటం జరిగింది. కరిడికొండ, అలరుదిన్నె, కొత్తపేట గ్రామ పొలాల్లో రైతులను కలిసి నష్టపోయిన పంటల గురించి తెలుసుకున్న జనసేన పార్టీ స్థానిక మండల, గ్రామ నాయకులు.

తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని, గత నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల్లో నష్టపోయిన ఒక ఎకరానికి సుమారు 15 వేల నుంచి 25 వేల వరకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని జనసేన తరపున డిమాండ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో నందు, రామ లక్ష్మణ్, ఆంథోని మరియు జనసేన పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.