రేపల్లెలో ఘనంగా జనసేన పార్టీ కార్యాలయం మరియు జెండా ఆవిష్కరణ

రేపల్లె నియోజకవర్గం పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన జెండా దిమ్మల ఆవిష్కరణలు పట్టణంలో 2,3,4,5 వార్డుల్లో ఘనంగా జరిగాయి. అనంతరం రేపల్లె టౌన్ అంకమ్మ చెట్టు సెంటర్ నుండి జనసేన పార్టీ నూతన కార్యాలయం వరకూ రెండు కిలోమీటర్ల ర్యాలీ జనసందోహంతో అద్భుతంగా సాగింది. ఈ భారీ ర్యాలీలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రేపల్లె టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు పాల్గొని అనంతరం జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల అధ్యక్షులు, పట్టణ కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.