పులి కిషోర్ బాబును సత్కరించిన బొటుకు రమేష్ బాబు

దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో పులి కిషోర్ బాబును దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొటుకు రమేష్ బాబు మరియు దిరిశాల ఏసురెడ్డి సత్కరించడం జరిగింది. మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కుతోటి పౌల్ ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గ మాల మహానాడు యూత్ అధ్యక్షుడిగా పులి కిషోర్ బాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కిషోర్ బాబు ముండ్లమూరు మండల జనసేన పార్టీ ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అందుకు గాను ఆదివారం దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొటుకు రమేష్ అలాగే దిరిశాల ఏసురెడ్డి, దర్శి జనసేన నాయకులు గరికిపాటి వెంకట మరియు ముండ్లమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట రామారావు, దర్శి నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మం, దర్శి టౌన్ అధ్యక్షులు చాతి రాసి కొండయ్య, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి వివిధ మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొని అభినందనలు తెలియజేసారు.