జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ చిత్తూరు పర్యటన వివరాలు

గత వారం నుండి కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి చుట్టుపక్కల గ్రామాలు అలాగే శ్రీకాళహస్తి, కడప, రాజంపేటలో జరిగిన పంట నష్టం ప్రాణ నష్టం వలన చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి బాధిత కుటుంబాలను పరామర్శించడానికి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటన ఉన్నందున దానికి ముందు సంబంధిత ప్రాంతాలను పరిశీలించి ప్రజల కష్టాలను జరిగిన నష్టాలను తెలుసుకునేందుకు శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు.

కావున 23/11/2021 మధ్యాహ్నం 1:30లకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు, అక్కడనుంచి రేణిగుంట రోడ్డు ఖ్ళం హాస్పిటల్ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న బాధిత కొన్ని కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది.

తదుపరి 2:30లకు తిరుపతి బాబు జగ్జీవన్ రావు పార్క్ వద్దగల కేశవాయనగుంట వరద బాధిత ప్రజలను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసి,అక్కడ నుండి కట్టకిందపల్లి కొర్లగుంట చివ్వరకు చేరుకొని అక్కడి బాధిత ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వారికి మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య నిపుణుల చేత వైద్యం కూడా జనసేన పార్టీ తరపున అందించడం జరుగుతుంది.

అక్కడ నుండి తిరిగి 3, 4 గంటల మధ్యలో తిరుపతి శ్రీ కృష్ణా నగర్ నందు రెండు రోజులుగా స్థానిక ప్రజలు వరదల కారణంగా చాలా ఇబ్బందులకు గురఅవుతున్న పరిస్థితులలో వారికి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేసి, అక్కడి నుంచి తిరుపతి చుట్టుపక్కల ఈ వరద ముంపుకు కారణం అయిన కబ్జాలకు గురైనా చెరువులను సందర్శించి తుమ్మలగుంట అవిలాల చెరువులను చూసుకొని తిరుపతికి చేరుకుంటారు.