గజ్జెల సందీప్ కి జనసేన పార్టీ ఘననివాళి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన గజ్జల సందీప్ ఎఐఎస్ఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు మరణించడం జరిగింది. ఆయన దశాదినకర్మలో భాగంగా జనసేన పార్టీ నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం మరియు ములకలపల్లి మండల అధ్యక్షులు సందీప్ మరణం చాలా బాధాకరమని ఎఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో మండల స్థాయి నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు స్థాయికి ఎదిగి అనేక విద్యార్థి ఉద్యమాలు చేసిన సందీప్ జిల్లా మొత్తం సైకిల్ యాత్ర చేసి ప్రతి పాఠశాలలో విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేశాడు సందీప్ మంచి ప్రసంగికుడిగా, గాయకుడిగా, వ్యాఖ్యాతగా, మంచి స్నేహితుడుగా ప్రజల్లో గుర్తింపు పొందాడు అని జనసేన పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు గొల్ల వీరభద్రం, కోడిమే వంశి, ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, సహాయ కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు మరియు ముఖ్య నాయకులు కందుకూరి వినీత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.