అగ్నిప్రమాద బాధితులకు అండగా జనసేన పార్టీ

బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, వేమూరు మండలం చావలి గ్రామంలో ఫిబ్రవరి రెండు 2024 రాత్రి 10 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా సిగిరి శెట్టి యానాది ఇల్లు పూర్తిగా కాలిపోయింది. వారి కుటుంబానికి అండగా బుధవారం చావలి ఎంపీటీసీ గాజుల నగేష్ అధ్వర్యంలో దుస్తులు, వంట సామాగ్రి, సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ 12000 రూపాయలు ఆర్థిక సహాయం బాధిత సిగిరిసెట్టీ యానాది కుటుంబానికి అందచేశారు. ఈ కార్యక్రమంలో తాడికొండ శివరామ కృష్ణ, సోమరౌతు బ్రహ్మం, సోమరౌతు వాలేశ్వరారావు, సోమారౌతు గోపాల కృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.