ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ప్రవీణ్ ఆదిత్య నియామకం నిబంధనలకు విరుద్దం

విజయనగరం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారిని కలిసి, నాలుగు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం తూర్పు గోదావరి జిల్లాలో పనిచేసిన ఐ ఏ ఎస్ ఆఫీసర్ అయిన సీ వీ ప్రవీణ్ ఆదిత్య గారిని 37-పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించడం భారత ప్రధాన ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్దమని, కాబట్టి అతన్ని వెంటనే రిటర్నింగ్ అధికారిగా తీసివేయాలని వ్రాత పూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్, సెక్రటరీ కోటేశ్వరరావు పాల్గొనడం జరిగింది.