సివిల్స్ లో 56వ స్థానాన్ని సాధించిన కిరణ్మయికి జనసేన సత్కారం

కాకినాడ రూరల్ నియోజకవర్గం వలసపాకల గ్రామానికి చెందిన డాక్టర్. కొప్పిశెట్టి కిరణ్మయి సివిల్స్ లో 56వ స్థానాన్ని సాధించడం ఎంతో గర్వకారణం. ఆమెను సోమవారం కాకినాడలో ఆమె స్వగృహంలో కలిసి ఆమెకి, వారి కుటుంబ సభ్యులకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.