శ్రీశ్రీశ్రీ తాడేలమ్మ తల్లి జాతరలో పాల్గొన్న బత్తుల బలరామకృష్ణ

రాజానగరం మండలం, పాలచర్ల గ్రామంలో వెలసిన భక్తులు కోరిన కోరికలు తీర్చడంలో అమ్మలు గన్న అమ్మ, భక్తుల పాలిట కొంగుబంగారమై ఆ ప్రాంత ప్రజలను రక్షించి కాపాడుతున్న తల్లి శ్రీశ్రీశ్రీ తాడేలమ్మ తల్లి జాతర మరియు మహా అన్నదాన కమిటీ ఆహ్వానం మేరకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ అమ్మ వారిని దర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తాడేలమ్మ తల్లి అమ్మవారి జాతర కమిటీ వారు గౌరవపూర్వకంగా ఘనస్వాగతం పలికి సత్కరించి గుడి ప్ర్రాముఖ్యత, అమ్మవారి విశిస్టత భక్తులు పొందుతున్న అనుభూతులు వివరించారు. తరువాత ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి కోలాటం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన చిన్నారులతో ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగిశెట్టి రాజేంద్ర, సురపురెడ్డి రాజారావు, కొత్తపల్లి బుజ్జి, తిరుమలశెట్టి శ్రీనువాసు, మదిరెడ్డి బాబులు, దాసరి శ్రీను, రావిపాటి వెంకటేష్, ముత్యం వెంకటేష్, బదిరెడ్డి లోకేష్, గల్లా నితిన్, తిరుమలశెట్టి చిన్న, పిల్లా సాయి, బోయిడి భార్గవ్, అఖిల్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.