తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద గుమ్మడికాయ కొట్టి పూజలు నిర్వహించిన జనసేన

*తిరుపతిని తిరుపతి జిల్లాగా ప్రకటించడంతో సంబరాలు జరుపుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు.

తిరుపతి, ఏపి ప్రభుత్వం ఆదివారం తిరుపతిని తిరుపతి జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ… గతంలో “బాలాజీ జిల్లా వద్దు తిరుపతి జిల్లానే ముద్దు” అని స్థానిక ప్రజలతో నిరసనలు తెలియజేసిన పోరాట ఫలితమే తిరుపతిని జిల్లాగా ప్రకటించారంటూ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లాగా ప్రకటించేందుకు సహాకరించిన అధికారులకు, అధికార యంత్రాంగానికి జనసేనతో కలిసి గొంతెత్తిన స్థానిక ప్రజలకు, మీడియా ప్రతినిధులకు జనసేన నేతలు కృతజ్జ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబ్జి, హేమ కుమార్, సుమన్ బాబు, మునిస్వామి, అమృత, కీర్తన, కోకిల, లత, ముక్కు సత్యవంతుడు, బలరాం, రమేష్, మనోజ్, షరీఫ్, జీవన్, హేమంత్, గోపి, ఆదికేశవులు, బాలాజీ, మోహన్,మని, కిషోర్, పవన్,రాజేష్, కోమల్, సాయిదేవ్ మరియు నాయకులు వీరమహిళలు మరియు జనసైనికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.