జిల్లా ఎస్పీకి వినతిపత్రమిచ్చిన జనసేన

విజయనగరం జిల్లా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక మాఫియా చేస్తున్నటువంటి ఆగడాలపై జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళినటువంటి జనసైనికులు మీద పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి, అక్రమ కేసులు బనాయించిన సంఘటనలో భాగంగా అరెస్టయిన కార్యకర్తలను పార్వతిపురం జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి పరామర్శించి వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీని కలిసి జరిగిన సంఘటనపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ కి ఇసుక మాఫియా మీద పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి బాబు పాలూరు జిల్లాలో ఉన్నటువంటి 9 నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.