జనసేన పోరుబాట 10 వ రోజు పాదయాత్ర

ఏలూరు, స్ధానిక 50 వ డివిజన్ ఏలూరు నగర మేయర్ సొంత వార్డులో మార్కెట్ యార్డు ఏరియాలో రెడ్డి అప్పల నాయుడు ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటను నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఏలూరు నగర మేయర్ సొంత ఇలాకాలో అనేక సమస్యలతో సతమతమవుతున్న వార్డు ప్రజలను పరామర్శించి సొంత మున్సిపల్ అధికారులతో మురుగు డ్రైన్ శుభ్రపరచడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్తపై పన్నులు విధించి ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారు. ఏ సందులో చూసినా రోడ్ల మీద ఉన్న చెత్తను తొలగించడం లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచి సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా అర్హులైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ తొలగించడం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందని ద్రాక్షల ఉన్నాయని ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తుమ్మపాల రామకృష్ణ దనానా విజయ్, ముత్యాల రాము, ఆబోతుల గణపతి, తుమరాడ లక్ష్మి నాయుడు, దనానా సింహాచలం, ఆబోతుల సత్యారావు, మాణిక్యాలరావు, ఉమా దుర్గా, రాయి రమేష్ మరియు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.