మహశివరాత్రి సందర్భంగా జనసేన ప్రభ

గుండవరం గ్రామంలో మహశివరాత్రి సందర్భంగా గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన గ్రామ ప్రభను జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన కోలాటంను కూడా ప్రారంభించారు ప్రభను నారాకోడూరుకి గ్రామ ప్రజల సహకారం తోటి ఘనంగా బయలుదేరింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, సినియర్ నాయకులు గాదె లక్ష్మణరావు కారుమంచి కోటేశ్వరరావు, స్థానిక గుండవరం జనసేన పార్టీ నాయకులు నాగబాబు ఆధ్వర్యంలో శేఖర్ బాబు బాలాజీ, శ్రీనివాస్ వెంకటేశ్వర్లు, చేబ్రోలు జనసేన పార్టి నాయకులు నారిశెట్టి కృష్ణయ్య, మరియు గ్రామ పెద్దలు వీరమహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.