పింగళి వెంకయ్య జయంతి వేడుకలో పాల్గొన్న అక్కల గాంధీ

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి 145 జయంతి వేడుకలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ అక్కల రామమోహన్ రావు (గాంధీ).. పాల్గొని పింగళి వెంకయ్యకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.

పింగళి వెంకయ్య గారి స్వగ్రామం అయిన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రు గ్రామంలో పింగళి వెంకయ్య జయంతి సందర్బంగా జాతీయ జెండా ఎగురవేసి, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కటింగ్ చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన రూపొందించిన జాతీయ జెండా ప్రపంచం మొత్తం భారత దేశం యొక్క ఖ్యాతి విస్తరించడం జరిగింది.

ఈ సందర్బంగా అక్కల గాంధీ మాట్లాడుతూ పింగళి వెంకయ్య గారికి భారత రత్నా అవార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చెయ్యడం జరిగింది..

ఈ కార్యక్రమంలో జె.డి లక్ష్మి నారాయణ, వి.హెచ్ హనుమంతురావు, ప్రజాపతి, అజయ్ పాల్గొన్నారు..