డబుల్ బెడ్ రూం ఇండ్లు అర్హులైన వారికే ఇవ్వాలి – హుస్నాబాద్ జనసేన

  • హుస్నాబాద్ జనసేన అధ్వర్యంలో ఆర్.డి.ఓ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు

హుస్నాబాద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా ఉన్నవారికి ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్.డి.ఓ మరియు మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పథకాన్ని పట్టణంలోని ఇల్లు లేని వారిని గుర్తించి, అవకతవకలు జరుగకుండా రీ సర్వే చేసి, అర్హులకు ఇవ్వాలని జనసేన పార్టీ తరపున కోరుతూ, లేనిచో అర్హులకు ఇల్లు కేటాయించేవరకు జనసేన పార్టీ తరపున ఉద్యమిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జేరిపోతుల సంజీవ్, బత్తుల జగదీష్, గోపి, రఘు, లక్ష్మణ్, బాబు తదితరులు పాల్గొన్నారు.