విద్యుత్ చార్జీలమోత, అప్రకటిత విద్యుత్ కోతలపై జనసేన నిరసన

చీపురుపల్లి నీయోజకవర్గం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న కరెంట్ చార్జీలు, అప్రకటిత కరెంట్ కోతలకు వ్యతిరేకంగా అప్రకటిత కరెంట్ కోత – కరెంట్ చార్జీలమోత పేరిట స్థానిక జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చీపురుపల్లి మెయిన్ రోడ్ లో ర్యాలీగా వెల్లి మూడు రోడ్ల కూడలిలో నిరసన గళం వినిపించారు. ఆనంతరం చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కరెంటు కోతల వలన, అసలే అరకొర వర్షాలతో బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేసిన రైతులు తాను వేసిన పంటకు సకాలంలో నీరు లేక రైతులు తీవ్రంగా నష్టోతున్నారని, అసంఘిటిత కార్మికులైన కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత, భవన కార్మికులు, శ్రామికులు, కర్షకులు, కుటీర పరిశ్రమలు సైతం కుదేలై ఈ వైసీపీ ప్రభుత్వము ప్రజలకు కడుపుకోతను మిగులుస్తుందనీ విమర్శించారు. అలాగే మెరకముడిదం జనసేన పార్టీ మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణినాయుడు మాట్లడుతూ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దోమలు ఈగలతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురై హాస్పిటల్ పాలైనా ఇంతవరకు దోమల నివారణకు ఈ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ యంత్రాగం మొద్దు నిద్ర వహిస్తుంది. పల్లె పట్టణ ప్రాంతాలలో డెంగ్యూ మలేరియా డయేరియా వంటి రోగాలు విజృంభస్తున్నాయి. వాటిని నివారించుటకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంతవరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, అధికారులూ నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ చేతకాని వైసీపీ ప్రబుత్వానికి బుద్ధిచెప్పి జనసేన ప్రభుత్వాన్నీ స్థాపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. అలాగే జనసేన నాయకులు వై. లక్ష్మి నాయుడు మాట్లడుతూ కరెంట్ కోతలతో విద్యార్థులు పరీక్షల టైంలో తీవ్రంగా నష్టపోతున్నారని, జాబ్ కేలండర్ ఎలాగూ లేదు కనీసం చదువుకోవడానికి కరెంట్ ఇవ్వలేని పరస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన పార్టీనాయకులు యడ్ల సంతోష్, రామునాయుడు, సత్యన్నారాయణ, రమణ, యేసు, శ్రీను బాల, సింహాచలం, శంకర్, ధనుంజయ, ప్రతాప్, సురేష్, కర్లం జనసైనికులు, చీపురుపల్లి జనసైనికులు పాల్గొన్నారు.