కంచికచర్లలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

నందిగామ నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం కంచికచర్ల వసంత కాలనీలో బుధవారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నాయిని సతీష్ ఆధ్వర్యంలో క్రియాశీల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా నాయిని సతీష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబాలకు అండగా నిలవాలని 500 రూపాయల నగదు చెల్లించి క్రియ శీలక సభ్యత్వాలు తీసుకుంటే ప్రమాదంలో శాత్తు కార్యకర్త మృతి చెందితే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ప్రమాదపు బీమా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కంచికచర్ల మండలంలో క్రియాశీలక సభ్యత్వాలను నమోదు విజయవంతంగా పూర్తి చేసిన వారికి పార్టీ అధినేత సంతకంతో కూడిన లెటర్ ప్యాడ్, ఐడి కార్డు తమ పార్టీ గుర్తు టి గ్లాసు అందచేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుప్పాల వేణు తోట మంత్రాలు బత్తిన ఇమానీలు తదితరులు పాల్గొన్నారు.