అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధితులకు ఆర్ధిక సాయమందించిన జనసేన

అమలాపురం రూరల్ ఇందుపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాదితులను జనసేన పార్టీ నాయకులు శ్రీ యాళ్ళ నాగ సతీష్ అధ్వర్యంలో రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, నల్లా వెంకటేశ్వరరావు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస బాధితులను కలిసి వారికి నిత్యావసర సరుకుల (కిరాణా,దుప్పట్లు)6 వేల రూపాయలు నగదు అందజేయడం జరిగింది ప్రజలకు ఏ సమస్య వచ్చిన జనసేన అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందుపల్లి గ్రామ వైస్ ప్రెసిడెంట్ హానుమాన్ బుజ్జి, ఎంపిటిసి రాంబాబు, జనసేన పార్టీ నాయకులు నారాయణమూర్తి, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస, ఇందుపల్లి జనసేన పార్టీ ఎంపిటిసి శ్రీరామ చంద్ర మూర్తి మరియు జనసైనికులు పాల్గొన్నారు.