తాళ్లవలస పంచాయతీలో జనసైనికులను కలిసిన నాయకులు

శ్రీకాకుళం జిల్లా, లావేరు మండల జనసేనపార్టీ బలోపేతంలో భాగంగా తాళ్లవలస పంచాయతీలో పర్యటించి జనసైనుకులతో మమేకమవుతూ సంస్థాగతంగా, పార్టీ బలోపేతం మరియు పార్టీ సిద్ధాంతాలను గడప గడపకు ప్రజల్లోకి ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్ళాలో అనే విషయం మరియు క్రియాశీలక సభ్యత్వం గురించి గ్రామాల్లో ఏవిధంగా సమస్యల మీద ముందుకు వెళ్ళాలో అనే విషయంపై దిశానిద్దేశం చేసిన జనసేన నాయకులు. అలాగే ప్రతీ గ్రామంలో 2024 నాటికి ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేసే విధంగా ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి కృషిచేయాలని తెలియచేసిన జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనసైనుకులు డోర రాజారమేష్, బార్నాల దుర్గారావు, లంక గోపాల్, గొర్లె సూర్యనారాయణ, పవన్, సురేష్, శ్రీను, నాయుడు, కోటి, గౌతమ్, పవన్, శంకర్, వెంకటేష్ కిషోర్, జనసైనికులు పాల్గొన్నారు.