నల్లగుంట, శాంతి నగర్, రాయనపాడు గ్రామాలలో జనసేన రచ్చబండ కార్యక్రమం

మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గ్రామాల ప్రజలతో మైలవరం నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామెహన్ రావు(గాంధీ)మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ పదవి లేక పోయిన చనిపోయిన రైతులకు లక్ష రూపాయల చొప్పున సొంత డబ్బులు 3000 మందికి ఇవ్వడం జరుగుతుంది. పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి పవన్ కళ్యణ్ అన్నారు. నిజమైన్న ప్రజాస్వామ్యం జనసేన పార్టీ ద్వారా సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండలం ప్రసిడెంట్ కొల్లా రాజు, జిల్లా సెక్రటరీ శ్రీమతి చింతల లక్ష్మీ మండల నాయకులు కాంతకుమారి, శ్రీనివాస్, కె.ఎన్.కె ప్రసాద్, దుర్గ కోటేశ్వరరావు, శివకృష్ణ, గోపి, జయ, అరవింద్ కుమార్, కిరణ్, కళ్యాణ్ క్రియాశీలక సభ్యులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీరమహిళలు, ప్రజలు పాల్గొన్నారు.