ప్రజావైద్యశాల నందు చికిత్స పొందుతున్న బాధితులకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, డేగపూడి గ్రామం నందు విష జ్వరాలతో అల్లాడుతూ నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల నందు చికిత్స పొందుతున్న డేగపూడి గ్రామానికి చెందిన వారిని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది. వారికి బ్రెడ్ అందివ్వడంతో పాటు వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అనే విషయాన్ని వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏ సమయంలో అయినా సరే అత్యవసరమైతే మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీహరి, సందీప్, రవి, తదితరులు పాల్గొన్నారు.