బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన ప్రతినిధులు

చీరాల మండలం, వాడరేవులో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో బాధితులు బోటు యజమాని వంకా దారాబాబు మరియు కళాశీలను రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి పొక్కింగారి రాజు, ప్రకాశం ఉమ్మడి జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పాలవలస శ్రీనివాస్, వేటపాలెం మండల ఉపాదక్ష్యుడు కర్ణ కిరణ్ తేజ్ బాధితుడిని పరామర్శించి.. ఈ సమస్యను జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ద్వారా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్థానిక కార్యకర్తలు బొంది రాజు, నాగరాజు పాల్గొన్నారు.