జనసేనాని నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: సీ.జి రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు మద్దికేర మండలంలో పార్టీ మారుతున్నారు అనే విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సీ.జి రాజశేఖర్ పేర్కొన్నారు. శనివారం జనసేన పార్టీ నాయకులు సర్పంచ్ అభ్యర్థి, ఎంపిటిసి అభ్యర్థి, మద్దికేర మండలం నందు త్వరలో వైసీపీలోకి చేరిక, అని వచ్చిన తప్పుడు వార్తను ఖండిస్తున్నానన్నారు, ఈ సందర్భంగా సిజి రాజశేఖర్ మాట్లాడుతూ.. మద్దికేరలో పోటీ చేసిన అభ్యర్థులు జెడ్పిటిసి అభ్యర్థి మార్ గుండు జయరాముడు, అలాగే సర్పంచ్ అభ్యర్థి గద్దల రాజు, మద్దికేర టౌన్ నందు నాలుగు కి నాలుగు ఎంపీటీసీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, 1వ ఎంపీటీసీగా, చిరంజీవి 2వ ఎంపీటీసీగా గద్దల అజయ్, 3వ ఎంపీటీసీగా, ఎంపీటీసీ వడ్ల కంబగిరి, 4వ, ఎంపీటీసీగా ఎంపీటీసీ తిమ్మప్ప, మద్దికేర టౌన్ నందు పోటీ చేసి ఎవరు ఎన్ని భయ ప్రాంతాలు గురిచేసిన, ఎవరికి భయపడకుండా, ఎవరు ఎన్ని ఆశలు చూపిన ఎవరికి లొంగకుండా, చాలా నిజాయితీగా పోటీ చేసిన వారు ఈరోజు జనసేన పార్టీ వీడుతున్నారు అనేది ఆవాస్తవం. ఎలక్షన్ టైంలో వారు నిలబడిన తీరు అమోఘం, ఓటమి గెలుపును పక్కనపెడితే వీరందరూ పార్టీ బలపేతం కోసం, ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు, ఎవరు ఎలాంటి తప్పుడు వార్తలు రాసినా మేము ఆదరం బెదరం అని తెలియజేస్తున్నాం, పత్తికొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే జనసేన ప్రజా పోరాట యాత్రలో నేను చూసిన వంటి అభిమానులు కార్యకర్తలు నాయకులు పార్టీ బలపేతం కోసం ఎలా కష్టపడుతున్నారో మాకు తెలుసు, ఇలాంటి వారిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలియజేస్తున్నాం, అలాగే ఈరోజు మద్దికేర మండలం నాయకులు మాట్లాడుతూ, దయచేసి జనసేన పార్టీపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరు కూడా చేయొద్దని, తెలియజేశారు. ఎందుకంటే మద్దికేర మండలంలో, జనసేన పార్టీ చాలా బలంగా ఉంది, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి, ఆశయాలు, సిద్ధాంతాల కోసం, జనసేన పార్టీని ఇంకా బలంగా ప్రజలకి తీసుకువెళ్లి, ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా జనసేన టిడిపి కలిసి పోటీ చేస్తాయి, అలాగే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా అధికారంలోకి తీసుకురావడానికి మద్దికేర మండలం నందు జనసేన పార్టీ నాయకులు చాలా బలంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాం, జనసేన పార్టీ అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకున్న మేము అధ్యక్షులు వారి నిర్ణయాన్ని కట్టుబడి పని చేస్తామని మండల కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు జయరామ్, శాంతరాజ్, అశోక్ అజయ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధిష్టానం మేరకు ఏ పార్టీతో వెళ్లి 2024 ఎలక్షన్లకు కృషి చేయాలి పార్టీ తెలుపుతుంది. శనివారం దినపత్రికలలో జనసైనికులు వైసిపి తీర్థం పుచ్చుకుంటారు అనేది కావడం జరిగింది ఇది పూర్తిగా అవాస్తవం. సర్పంచ్ ఎంపీటీసీ అభ్యర్థులు ఏ పార్టీలోకి వెళ్లడం లేదు. పార్టీ తరఫున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి ఎంపిటిసిలు తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అభ్యర్థి మారు గుండు జయరాం, మండల నాయకులు గద్దల రాజు, ఎంపిటిసి అభ్యర్థిలు అజయ్ కుమార్, కంబగిరి, తిమ్మప్ప చిరంజీవి. అశోక్ కుమార్, నరేష్, శ్రీనివాసులు, చక్రవర్తి, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.