ఉమ్మడి నెల్లూరు జిల్లా ముఖ్య నాయకులతో జనసేనాని సమీక్ష సమావేశం

ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ముఖ్య నాయకులతో శనివారం హైదరాబాదులో జనసేనాని సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా అందరు నాయకులు కలిసి పని చేయాలని, రానున్న రోజుల్లో జనసేన పార్టీని నెల్లూరు జిల్లాలో విస్తృతంగా క్షేత్రస్థాయిలో జాతీయ మీడియా అధ్యక్షుడు అజయ్, నాగబాబు పర్యటించి బలపరుస్తారని పిలుపు నిచ్చారు. నెల్లూరు జిల్లా తన సొంత జిల్లా వంటిది ఈ సారి నెల్లూరు జిల్లాలో పార్టీ సొంత కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎంతో బలం కలిగిన నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడతామని హామీ నిచ్చ్చారు. వచ్చే నెలలో జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పది నియోజవర్గ వర్గాల వారీగా సమీక్ష సమావేశం నెల్లూరులో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.