తవలం పంచాయతీలో జనంలోకి జనసేన పల్లెబాట

మదనపల్లె నియోజకవర్గం: నిమ్మనపల్లె మండలం, తవలం పంచాయతీలో జనంలోకి జనసేన పల్లెబాటలో భాగంగా ఇంటి ఇంటికి టీడీపీ, జనసేన కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమం జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి అధ్యక్షతన నిమ్మనపల్లె జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్ మరియు ప్రధాన కార్యదర్శి జనార్దన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, తెలుగుదేశం నాయకులు ప్రస్తుత సర్పంచ్ రెడ్డప్ప, మాజీ ఎంపీటీసీ సి రెడ్డప్ప, మాజీ ఆసుపత్రి చైర్మన్ శ్రీపతి, ముస్టరు పంచాయతీ మాజీ సర్పంచ్ రమణ మరియు జనసేన మదనపల్లె ప్రధాన కార్యదర్శి వీరమహిళ కావలి రెడ్డెమ్మ, సరోజమ్మ, కొలిమి ప్రసాద్, కుమార్, అర్జున నిమ్మనపల్లె ఆఫ్రోజ్, బాబీ, మాలి, సుహాయిల్ తదితరులతో ప్రచారం చేయడం జరిగింది. ఈ జగన్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో స్వయంగా తెలుకొని రాబోవు జనసేన టీడీపీ ప్రభుత్వంలో మీ కష్టాలు తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది.