ఎన్.టి.ఆర్ కు ఘన నివాళులు

మదనపల్లి: స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మదనపల్లి టిడిపి ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు దోమలపాటి రమేష్, మదనపల్లి జనసేన నాయకుడు శ్రీరామ రామాంజనేయులు ఘన నివాళులు అర్పించారు. తదనంతరం టిడిపి, జనసేన నాయకులు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, టిడిపి ఇంచార్జి దొమ్మలపాటి రమేష్, దొమ్మలపాటి చాణక్య, టిడిపి నాయకులు, జనసేన సోను, గంగాధర్, ధరణి, బహదూర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.