జనసేన – జనం కోసం పోరాడాలి

  • ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
  • పవనిజంపై ప్రజలకు అవగాహన కల్పించి పార్టీలో చేరికలు ప్రోత్సహించండి
  • జనసేన పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

విజయ నగరం: జనసేన పార్టీ జనం కోసం పోరాటం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ తో ఆమె మాట్లాడుతూ జనసైనికులు, వీరమహిళలు, జనసేన పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేసి ప్రజలకు అండగా ఉండాలన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వారి వెంట నిలబడి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో, వార్డుల్లో విరివిగా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని అవి అధికారులు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేసి జనసేన ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న విషయాన్ని ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు పవనిజంపై అవగాహన కల్పించి పార్టీలోకి చేరికలను ప్రోత్సహించాలన్నారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా జనసేనానిని ముఖ్యమంత్రిని చేసే విధంగా ప్రతి జనసైనికులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించారు. వాటి పట్ల వ్యవహరించాల్సిన తీరుపై దిశా నిర్దేశం చేశారు.