హుక్కుంపేటలో జనసేన ఆత్మీయ సమావేశం

అరకు, జనసేన పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా అరకు నియోజకవర్గంలో గల హుక్కుంపేట మండల కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో గల మారుమూల ప్రాంతమైన బూర్జ పంచాయితీ మజ్జివలస గ్రామంలో సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సమావేశంలో జనసేన సిద్ధాంతాలతో పాటు జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్ధి గెలుపు కోసం అనుసరించాల్సిన అంశాలకు సంబంధించి వివరించటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అరకు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చెట్టి చిరంజీవి ఆదేశాలలో భాగంగా హుక్కుంపేట మండల నాయకులు మజ్జి కృష్ణ మరియు పరశురామ్ ల అధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా కార్య నిర్వహణ కమటీ సభ్యుడు పరదని సురేష్ పాల్గొనడం జరిగింది. అలాగే జనసేన పార్టీ ముఖ్య నాయకులు చెట్టి ఆనంద్, కొండబాబు, రాంబాబు, మహేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.