రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ఆర్కే వారియర్స్

కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గుడివాడ పట్టణానికి చెందిన పల్లవి అనే గర్భిణీ స్త్రీకి శాస్త్ర చికిత్స కొరకు రక్తం అవసరం అవడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ కి తెలియజేయగా గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ వెంటనే స్పందించి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ (ఆర్కె) మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే పిలుపు మేరకు గుడివాడ పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అనేకసార్లు రక్తదానం చేసి ప్రజలకు తోడుగా ఉంటున్నామని గుడివాడ పట్టణానికి చెందిన పల్లవి అనే గర్భిణీ స్త్రీకి శస్త్ర చికిత్స నిమిత్తం అత్యవసరంగా రక్తం అవసరం అవడంతో మమ్మల్ని సంప్రదించగా వెంటనే రక్తదానం చేసి ఆ తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా చాలామంది యువత రక్తం ఇవ్వాలంటే లేనిపోని అపోహాలు మనసులో పెట్టుకుని రక్తం ఇవ్వడానికి ముందుకు రావట్లేదని అవేమీ మనసులో పెట్టుకోకుండా రక్తదానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారని. దయచేసి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. మేము అడిగిన వెంటనే స్పందించిన సిద్దుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూనె అయ్యప్ప, మట్ట జగదీష్, చరణ్ తేజ్, దివిలి సురేష్, గంట అంజి, మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.